రంగస్థలంతో మెగా పవర్ స్టార్ రాం చరణ్ అసలు సిసలు స్టామినా ఏంటో అర్ధమైంది. ఇన్నాళ్లు మెగా వారసుడిగా సినిమాలు చేస్తున్న రాం చరణ్ చిట్టిబాబుగా రికార్డుల పని పట్టాడు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన వినయ విధేయ రామ మాత్రం అంచనాలను అందుకోలేదు.


బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన వివిఆర్ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా 50 కోట్ల పైన వసూళ్లు రాబట్టింది. అది కూడా రాం చరణ్ వల్లే అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ తో కలిసి రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. మెగా నందమూరి మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.


ఇక ఈ సినిమా కోసం ఈ ఇయర్ మొత్తం డేట్స్ ఇచ్చేసిన రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత అదిరిపోయే కాంబినేషన్ సెట్స్ చేసుకున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాం చరణ్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్నాడు.


మే 9న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. వంశీ చెప్పిన లైన్ నచ్చడంతో రాం చరణ్ తన నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితోనే ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి ఎవడు సినిమా చేశారు. ఆ సినిమా బాగానే ఆడింది. మరి ఈసారి రాం చరణ్ తో వంశీ పైడిపల్లి ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: