యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. మిగతా హీరోలంతా తమకు సంబందించిన విషయాలను ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం వంటి సోషల్ బ్లాగుల్లో పొందుపరచుకుంటే ప్రభాస్ మాత్రం వీటికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ప్రభాస్ నటించే సినిమా అప్డేట్స్ కావాలంటే ఇక సినిమా యూనిట్ నుండి అఫిషియల్ గా వస్తే తప్ప తెలుసుకోవడం కష్టం.


ఇక లేటెస్ట్ గా ప్రభాస్ ఇన్ స్టాగ్రాం లోకి ఎంటర్ అయ్యాడు. ఆ విషయం ఇంకా అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని అప్పుడే ప్రభాస్ ఖాతాలో 7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభాస్ ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ పై మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది. ప్రభాస్ కు ఎప్పుడో జాయిన్ అవమని చెప్పామని కాని తాను వినలేదని అన్నది.


చాలా రోజులుగా అడుగుతుండగా ప్రభాస్ ఇప్పుడు ఇన్ స్టాగ్రాం లోకి వచ్చారు. ఇక ఇన్ స్టా ఎకౌంట్ తెరచినా ప్రభాస్ ఇంకా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. సాహోకి సంబందిన అప్డేట్స్ ను తన ఇన్ స్టాగ్రాంలో పెట్టాలని చూస్తున్నాడు ప్రభాస్. బాహుబలికి ముందు ప్రభాస్ కేవలం ఒక తెలుగు హీరో మాత్రమే కాని బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు.


సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాను అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సాహో తర్వాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: