టాలీవుడ్ లో ముకుందా, ఒక లైలా కోసం సినిమాలతో అచ్చం తెలుగింటి అమ్మాయిలా దర్శనమిచ్చిన నటి పూజా హెగ్డే ఒక్కసారే బాలీవుడ్ లో మెరిసింది.  తెలుగులో గ్లామర్ పాత్రలు రాకపోవడంతో తనకు సరైన అవకాశాలు రావడం లేదని బాాలీవుడ్ కి జంప్ అయ్యింది.  కానీ అక్కడ పెద్దగా హిట్ కాలేక పోయింది.  దాంతో మళ్లీ తెలుగు, తమిళ సినిమాలనే నమ్ముకుంది.  అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం సినిమాలో ఓ రేంజ్ లో స్కిన్ షో చేసింది..బికినీ అందాలతో పిచ్చెక్కించింది.  ఇంకేముంది దర్శక, నిర్మాతల కళ్లు పూజాపై పడటం వరుసగా సినిమా చాన్సులు ఇవ్వడం జరుతుంది. 


ఇటీవల ఎన్టీఆర్ సరసన అరవింత సమేత, మహేష్ బాబు పక్కన మహర్షి సినిమాలో నటిస్తుంది.  అలాగే ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అసలే వ్యాయామశాలలో తరచుగా కఠినమైన కసరత్తులు చేస్తూ ఒంపుసొంపులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది. వీటికి సంబంధించిన ఫోటోలు ఈ మద్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.   తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఇందులో పూజ ఒక బికినీ డ్రెస్ వేసుకుంది.  


ఈ కిరాక్ బికినీ వేసుకొని తలపై చేతులు పెట్టుకుని పచ్చని చెట్ల మధ్యలో నిలబడింది.  ఖజురహో శిల్పంలా కనిపిస్తూ అందాలు అదరహో అనిపిస్తోంది.  ఇక ఈ ఫోటోను చూసిన నెటిజనులకు పిచ్చెక్కింది.  నాలుగు గంటల్లో మూడు లక్షలకు పైగా లైకులు కొట్టారు. అసలే ఎండా కాలం..పచ్చని చెట్ల మద్య పిచ్చెక్కించే అందాలు ప్రదర్శిస్తుంటే ఎవరు ఊరుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: