ప్రభాస్..ప్రభాస్..ప్రభాస్..ఈ పేరు టాలీవుడ్ లోనే కాదు జాతీయ, ప్రపంచ స్థాయిలో సినీ ప్రియులను ఆకర్షిస్తుంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా సినీ ప్రపంచానికి పరిచయం అయిన ప్రభాస్..హైట్, పర్సనాలిటీ హాలీవుడ్ రేంజ్ హీరోల మాదిరిగా ఉండటం ప్లస్ పాయింట్. ఈ హీరో చత్రపతి సినిమా నుంచి వరుసగా హీట్లు సాధించడం.. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి, బాహుబలి2’లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.
అప్పటి నుంచి ప్రభాస్ నటిస్తున్న సినిమాలపై కూడా జాతీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభాస్, సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రాజెక్ట్ మొదలై సంవత్సరం కావొస్తుంది. ఇటీవల హీరోయిన్ శ్రద్దాకపూర్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి మరెలాంటి అప్ డేట్స్ లేవు. రిలీజ్ డేట్ ఆగష్టు 15 అని తెలిసిందే. చివరి దశ షూటింగ్ లో ఉన్న 'సాహో' కు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ పిక్ లీక్ అయ్యింది.
ప్రభాస్, శ్రద్ధా కపూర్ మంచి రొమాంటిక్ మూడ్ ఉన్న ఈ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎప్పటి నుంచి ఈ జంట ఫోటో చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఉత్సాహపడుతున్న విషయం తెలిసిందే. ఒక స్టెయిన్ లెస్ స్టీల్ రెయిలింగ్ ను పట్టుకుని ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒకరికళ్ళలోకి ఒకరు ప్రేమగా చూస్తూ ఉన్నారు. పింక్ కలర్ డ్రెస్ లో ఉన్న శ్రద్ధా ఎక్స్ ప్రెషన్ మరింత రొమాంటిక్ గా ఉంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించేందుకు దాదాపుగా రూ. 300 కోట్ల రూపాయలు ఖర్చుతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు చాలా మంది ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఇప్పుడు లీకయిన పిక్ రొమాంటిక్ కావడంతో ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వచ్చింది.