ఆయన రూటే సెపరేటు. వర్మ పొగిడితే తిట్టినట్లు, తిడితే పొగిడినట్లు వుంటుందనుకోండి.. అది వేరే విషయం. అసలు విషయానికొస్తే, వర్మ, సోషల్ మీడియా వేదికగా బాలయ్య మీద వేసిన పంచ్ ఇప్పుడు బాలయ్య అభిమానులకి ఒళ్ళు మండిపోయేలా చేస్తోంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మామూలే. సోషల్ మీడియా వేదికగా ఆయా పార్టీల అభిమానులు, తమకు నచ్చని పార్టీలపైనా, నాయకులపైనా చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ అభిమానుల నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
అందులో చంద్రబాబునీ, లోకేష్నీ మాత్రమేకాదు.. బ్రాహ్మణినీ, బాలయ్యనీ ఓ ఆట ఆడేసుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఆయా పథకాలకు వీళ్ళంతా లబ్దిదారులవుతారన్నది ఆ పోస్ట్ సారాంశం. 'బాలకృష్ణకి ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్యం' అని సదరు పోస్ట్లో వైఎస్సార్సీపీ అభిమానులు పేర్కొంటే, దాన్ని రీపోస్ట్ చేసిన వర్మ 'మెరుగైన వైద్యం కాదు, మెరుగైన మానసిక వైద్యం' అనేశాడు. దాంతో బాలయ్య అభిమానులు తెగ గుస్సా అయిపోయారు. నిజానికి బాలయ్య మానసిక సమస్యలతో బాధపడుతున్నారన్నది స్వయానా ఆయన ఒప్పుకున్న విషయమే.
గతంలో నిర్మాత బెల్లంకొండ సురేష్పై కాల్పుల వ్యవహారం సమయంలో బాలయ్య, నిమ్స్ నుంచి 'మానసిక ఆరోగ్యం బాగాలేదు' అని సర్టిఫికెట్ తెచ్చుకున్న విషయం గుర్తుండే వుంటుంది. వర్మ ఏం చేసినా లాజికల్గానే వుంటుంది మరి.! కమెడియన్ అలీ హీరోయిజం గురించీ, పవన్కళ్యాణ్ చేసిన కామెడీ గురించీ వర్మ ట్విట్టర్లో చేసిన పోస్ట్ వైరల్గా మారడంతోనే సహజంగానే పవన్ ఫ్యాన్స్ కూడా వర్మని ఆడేసుకుంటున్నారనుకోండి.. అది వేరే విషయం. రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. ఎవరి మీదనైనా సెటైర్లు వేయగలడు. ఎవరితోనైనా కాలు దువ్వ గలడు.