టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి.   ఈ సినిమాలో అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా ఆమె డైలాగ్స్, నటన తెలుగు రాష్ట్ర ప్రేక్షులు నిజంగానే ఫిదా అయ్యారు.  ఒక్క సినిమాతోనే సాయి పల్లవికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.  దాంతో తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది.  అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్న సాయిపల్లవి గ్లామర్ తరహా పాత్రలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 

అంతే కాదు యాడ్స్ లో కూడా ఆమెకు ఎన్నో చాన్స్ లు వచ్చినా రిజక్ట్ చేసింది.  గతంలో ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చి గ్లామర్ పాత్రల్లో నటించమని చెప్పినా నిర్మోహమాటంగా రిజక్ట్ చేసిన విషయం తెలిసిందే.  చిత్ర పరిశ్రమలో తోటి నటీనటుల కంటే తాను డిఫరెంట్ అని సాయిపల్లవి మరోసారి నిరూపించుకుంది.  తాజాగా ఆమె ఒక భారీ డీల్ ను తిరస్కరించింది.

తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా ఉండమని ఓ ప్రముఖ ఫేస్ క్రీమ్ సంస్థ సాయి పల్లవిని సంప్రదించింది. ఇందుకు గాను సాయి పల్లవికి ఆ కంపెనీ వరు ఏకంగా రూ.2 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేశారట. కానీ, ఆ ఆఫర్ ను ఆమె సున్నితంగా తిరస్కరించింది. సినిమాల్లో కూడా తాను మేకప్ వేసుకోకుండా నటిస్తున్నానని... అలాంటిది ఫేస్ క్రీమ్ వాడమని జనాలను తాను ఎలా ప్రోత్సహిస్తానని ఆమె చెప్పింది.

చాలా మంది సబ్బులు, క్రీములు, షాంపోలు ఇలా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. అంతేంతుకు ఇటీవల ఓ పాటలో కన్నుకొట్టి కవ్వించిన ప్రియా ప్రకాశ్ వారియర్ సైతం ఎన్నో యాడ్స్ లో నటిస్తుంది.  మేకప్ లేకుండానే తమ ప్రకటనలో నటించమని సదరు సంస్థ ఆమెను కోరినా సున్నితంగా ఆఫర్ ను తిరస్కరించింది



మరింత సమాచారం తెలుసుకోండి: