పూనమ్ కౌర్   పవన్ కళ్యాణ్ వ్యవహారం అప్పట్లో పెద్ద సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టి తనను మానసికంగా వేధిస్తున్నారని సినీ నటి పూనమ్ కౌర్ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే కొంతమంది వ్యక్తులు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా దాదాపు ఏభై యూట్యూబ్ చానల్స్‌పై ఫిర్యాదు చేశారు పూనమ్. అయితే తనకు ఎవరిపై అనుమానం ఉందో పోలీసులకు సమాచారం ఇచ్చానన్నారు పూనమ్. తన లాంటి పరిస్థితి మరో అమ్మాయికి రాకూడనే పోలీసుల్ని ఆశ్రయించినట్టు తెలిపారు. అయితే తనను ఎందుకు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదని వాపోయారు పూనమ్. త్వరలోనే నిందితుల్ని పట్టుకుని శిక్షించాలని కోరారు పూనమ్. 


‘మాయాజాలం’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన పూనమ్ కౌర్.. గగనం, ఒక విచిత్రం, శౌర్యం, బ్రహ్మిగాడి కథ తదితర చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడలో కూడా పలు చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఎఫైర్ ఉందంటూ అప్పట్లో బాంబ్ పేల్చారు మూవీ క్రిటిక్ కత్తి మహేష్. ఈ వివాదంలో పూనమ్, కత్తి మహేష్‌ల మధ్య పెద్ద వివాదమే నడిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: