మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత మరింత జోష్ పెంచాడని చెప్పొచ్చు. ఖైది నంబర్ 150 సూపర్ హిట్ అవడమే కాకుండా పదేళ్ల తర్వాత మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. ఇక ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు తన తర్వాత సినిమా కొరటాల శివతో ఫిక్స్ చేసుకున్నాడు.  


ఆ సినిమా జూన్ లో మొదలవుతుందని తెలుస్తుంది. కొరటాల శివ సినిమా తర్వాత సౌత్ క్రేజీ డైరక్టర్ శంకర్ తో చిరు సినిమా ఉంటుందని తెలుస్తుంది. శంకర్ తో సినిమాపై ఎన్నాళ్ల నుండో ఆసక్తి చూపిస్తున్న చిరంజీవి ఫైనల్ గా తన 153వ సినిమా షురూ చేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరిస్తాడని తెలుస్తుంది.


చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఖైది నంబర్ 150 తో పాటుగా ప్రస్తుతం చేస్తున్న సైరా నరసింహా రెడ్డి చేయబోతున్న కొరటాల శివ మూవీ ఇవన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో ఉంటుందని తెలుస్తుంది. చిరుతో సినిమా కోసం ఎదురుచూస్తున్న అల్లు అరవింద్ ఫైనల్ గా శంకర్ తో సినిమా ఫిక్స్ చేశాడు. ఈ సినిమా కూడా శంకర్ మునుపటి సినిమాల్లానే ఓ సోషల్ మెసేజ్ తో ఉంటుందట.  


మరి శంకర్, చిరంజీవి కాంబినేషన్ అంటే సంచలనాలు అన్నట్టే. ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ కూడా 200 కోట్ల దాకా ఉండాలని చూస్తున్నారట. మరి చిరంజీవితో శంకర్ చేసే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. సైరా తర్వాత చేస్తున్న కొరటాల శివ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే వస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: