మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతుంది. కొన్ని యాక్షన్స్ సీన్స్ అక్కడ షూట్ చేస్తున్నారట. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా అసలైతే ఈ సమ్మర్ కల్లా పూర్తి చేసి రిలీజ్ చేయాల్సింది కాని షూటింగ్ లేట్ అవడం.. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది.


ఈ ఇయర్ దసరాకి సైరా వస్తుందని అంటుండగా అప్పటికి రావడం కష్టమే అని అంటున్నారు. దసరా కాదంటే సైరా సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఆల్రెడీ 2020 పొంగల్ వార్ లో సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. 


కథ.. కథనాలు ఎలా ఉన్న థియేటర్ కు వచ్చిన ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తే చాలు అనుకున్న అనీల్ రావిపుడి ఆ విధంగా సక్సెస్ అవుతూ వచ్చాడు. పటాస్ నుండి రీసెంట్ గా వచ్చిన ఎఫ్-2 వరకు సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. ఇక మహేష్ తో తీసే సినిమా కూడా అటు ఫన్ తో పాటుగా మహేష్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూస్తున్నారట.


మరి ఈ సినిమా కూడా సంక్రాతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. చిరుతో మహేష్ సినిమా ఫైట్ అంటే ఎంతో రసవత్తరంగా ఉంటుంది. ఇక ఇదే కాకుండా 2020 సంక్రాంతికి రజిని, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దర్భార్ సినిమా కూడా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. రజిని సినిమా ఎఫెక్ట్ ఎలా ఉన్నా మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ బాక్సాఫీస్ ఫైట్ తప్పదని చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: