జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆఫ్టర్ ఎలక్షన్స్ సపోర్ట్ గా మాట్లాడాడు థర్టీ ఇయర్స్ పృధ్వి. ఎలక్షన్స్ ముందు వైఎస్ జగన్ కు సపోర్ట్ గా వైసిపి తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన పాలిటిక్స్ లో పవన్ రాణించగలడా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన సిద్ధాంతాలు ఆయనవి.. ప్రశ్నించేందుకు ఆయన వచ్చారని.. అలాగే సమస్య ఏదైనా దాని సాల్వ్ చేసేలా ప్రయత్నాలు చేస్తాడని అన్నారు పృధ్వి.    


తాను చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన టైంలో కూడా అన్నయ్య తరపున ప్రచారంలో పాల్గొన్నామని. అయితే చిరంజీవి సున్నిత మనస్కుడు ఎవరైనా మాట అంటే తిరిగి మాట అనే నైజం ఆయనది కాదు. అందుకే ఆయన రాజకీయాల్లో రాణించలేదు. కాని పవన్ కళ్యాణ్ అలా కాదు ఆయన మాట్లాడుతుంటే మిగతా వాళ్లంతా ఎందుకు అడ్డు చెప్పరంటే ఆయనకు వేటి మీద వ్యామోహం లేదని అందుకే ఆయన మాటలకు అందరు భయపడతారని అన్నారు.


ఇక స్పెషల్ స్టేటస్ కోసం, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ తీసుకున్న స్టెప్ చాలా గొప్పదనని.. ప్రశ్నించేందుకు వచ్చిన పవన్ తాను అనుకున్నది చేయడంలో ఎలాంటి వెనుకంజ వేయడని అన్నారు. వైసిపి తరపున ప్రచారం చేసిన పృధ్వి సడెన్ గా పవన్ పై ఇలా పాజిటివ్ గా మాట్లాడటంపై అందరు ఆశ్చర్యపడుతున్నారు.


ఏపి ఎలక్షన్స్ రిజల్ట్ ను బట్టి పవన్ తన సినిమాల మీద దృష్టి పెట్టనున్నారు. అసలైతే ఎలక్షన్స్ తర్వాత తన భవిష్యత్ కార్యచరణల మీద పవన్ ఓ నిర్ణయానికి రానున్నారు. సూర్య మూవీ బ్యానర్ లో పవన్ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: