టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అట్లి కుమార్.   ఆ మద్య తమిళ స్టార్ హీరో విజయ్ తో  'తెరి' .. 'మెర్సల్' వంటి విజయవంతమైన సినిమాలు తీసిన అట్లి కుమార్ ఈ మద్య కోలీవుడ్లో అగ్రస్థాయి దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు.  ప్రస్తుతం స్టార్ హీరోలు, నిర్మాతలు అట్లి కుమార్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. సినిమా షూటింగు సమయంలో మహిళా జూనియర్ ఆర్టిస్టుల పట్ల ఆయన చాలా అవమానకరంగా వ్యవహరించాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది.  


ఓ షూటింగ్ సందర్భంలో జూనియర్ ఆర్టిస్టులకు సరైన భోజనం..మహిళలకు టాయిలెట్ సౌకర్యం గురించి అట్లీ కుమార్ ను అడిగినందుకు ఆయన రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.  తమను మహిళ ఆర్టిస్టుల్లా కాకుండా చాలా దారుణంగా అవమానించారని వాపోయింది.  ఈ సంఘటన 13 న జరిగింది..ఆ రోజే ఫిర్యాదు చేయాలని చూసినా..ఎన్నికల నేపథ్యంలో ఆగిపోవాల్సి వచ్చిందని జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు. 

కొంత కాలంగా సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యవహారలపై ఉద్యమాలు వస్తున్న సమయంలో ఒక దర్శకుడు అయి ఉండి మహిళా ఆర్టిస్టుల పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తించిన అట్లి కుమార్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయం పై ఇప్పటి వరకు అట్లి కుమార్ మాత్రం స్పందించలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: