గత ఏడాది "కాలా" "రోబొ 2" చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది సంక్రాంతికి "పేట" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు,  తెలుగులో పర్వాలేదు అనిపించుకున్న ఈ చిత్రం తమిళనాట ఘనవిజయాన్ని సాధించింది.  ఇక ఈ చిత్రం తర్వాత రజని గ్యాప్ తీసుకుంటారని వార్తలొచ్చినా అవి కొట్టి పారేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో "దర్బార్" చిత్రాన్ని ప్రారంభించారు రజని, ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తోంది. యువసంగీత సంచలనం అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రజని ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

ఇక ఇటీవలే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి లీక్ సమస్య వచ్చిపడింది. రజని-నయన్ మధ్య నడిచే షూటింగ్ పిక్స్ ని ఎవరో ఔత్సాహికులు నెట్లో పెట్టేసారు. అయితే ఈ పిక్స్ లో రజని క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఉండడం అసలుకే ఐపియల్ సీజన్ నడుస్తుండటంతో ఈ పిక్  క్షణాలలో  వైరల్ అయింది. ఇక రజని కొడితే బాల్ బౌండరీనే అంటూ నెట్ లో రజని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఆ పిక్ రజని విరామ సమయంలో యూనిట్ సభ్యులతో క్రికెట్ ఆడిన సందర్భంలోనిదని, ఈ పిక్ కి సినిమా కథకు సంబంధం లేదని  తమిళ మీడియా తేల్చింది. ఇక ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నివేద థామస్ ఒక ముఖ్య భూమిక పోషిస్తోంది.  ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: