టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడుగా ముద్ర వేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన సినిమా కెరియర్ లో ఎన్ని హిట్ సినిమాలు తీసాడు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కాని డిజాస్టర్ సినిమాలు ఎన్ని తీసాడు అంటే లెక్కలేనన్ని అని ఎవరైనా చెబుతారు. అయితే ఆర్జీవి దర్శకుడుతో బాలీవుడ్ స్థాయిలో ఎ రేంజ్ లో అయితే గుర్తింపు పొందాడో అదే స్థాయిలో తన వివాదాస్పద ప్రవర్తనతో ఎప్పటికప్పుడు వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో తలదూర్చడం, కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవడం ఆర్జీవికి భాగా అలవాటు.

ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్జీవి పబ్లిసిటీ స్టంట్ కి లెక్క లేదనే చెప్పాలి. ఏం చేసిన సోషల్ మీడియాలో దానిని హైలెట్ చేసుకొని పబ్లిసిటీ తెచ్చుకోవడంలో ఆర్జీవి ఇప్పుడు టాలీవుడ్ లో అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. ఇక తాజాగా తెలుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టాలీవుడ్ దిగ్గజ నటుడు ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టాలని తీసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించాడు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ఒక్క ఆంధ్రాలో తప్ప అన్ని ప్రాంతాలలో రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ కి ముందే సినిమాని కాంట్రవర్సీ చేసి కావాల్సినంత పబ్లిసిటీ రాము తెచ్చుకున్నాడు.

ఇక ఈ సినిమాతో తెలుగు దేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా టెన్సన్ పెట్టించాడు. అయితే ఎన్నికల ముందు తెలుగు దేశం పార్టీ ఫిర్యాదు మేరకు ఈ సినిమాని ఎన్నికల సంఘం రిలీజ్ కాకుండా అడ్డుకుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన నేపధ్యంలో ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ కి క్లియరన్స్ దొరికింది. దీంతో సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. మే ఒకటిన ఈ సినిమా ఏపీలో రిలీజ్ కానుంది. అయితే సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకున్న నేపధ్యంలో ఏపీ ప్రజలని ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు సందేహంగా ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: