వంశీ పైడిపల్లి ప్రతిసాత్మకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మహర్షి సినిమాని తెరకెక్కించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాని మహేష్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో ఏకంగా 140 కోట్లు పెట్టి తీసారు. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని నిర్మాత దిల్ రాజు, పీవీపీ పూర్తి చేసేసారు. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది. మహేష్ కి జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఈ సినిమా మీద హైప్ ని అమాంతం పెంచేశాయి. మహేష్ కెరియర్ లో ఇది మరో సూపర్ హిట్ సినిమా అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక నాన్ బాబుబలి రికార్డ్స్ అని ఈ సినిమాతో తుడుచుకుపోతాయని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదిలా  ఉంటే తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. వంశీ పైడిపల్లి మొత్తం ఎడిటింగ్ చేసి ఫైనల్ అవుట్ పుట్ తో కాపీ సిద్ధం చేసాడని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ రన్ టైం గురించి టాలీవుడ్ లో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.


మహేష్ కెరియర్ లో ఇది వరకు బ్రహ్మోత్సవం సినిమా వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇక అతని కెరియర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచినా ఆ సినిమా రన్ టైం ఏకంగా మూడు గంటల వరకు ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మహర్షి మూవీ రన్ టైం కూడా ఏకంగా రెండు గంటల నలభై నిమిషాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా మరో బ్రహ్మోత్సవం అవుతుందా అనే భయం ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో పట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: