టాలీవుడ్ లో పెళ్లిచూపులు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ వరుస విజయాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.  అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాల సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.  ఇక గీతాగోవిందం సినిమా అయితే ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడం మరో విశేషం.  ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వం  'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. 

ఈ సినిమాలో గీతాగోవిందం ఫేమ్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ‘గీతాగోవిందం’మూవీలో  వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ నటిస్తున్నారు..అంతే కాదు కాకినాడ యాసలో మాట్లాడుతారని టాక్.  ఇక రష్మిక మందన ఓ క్రికెట్ ప్లేయర్ గా నటిస్తుందట. అయితే ఈ సినిమా షూటింగ్ కాకినాడ .. తుని ప్రాంతాల్లో ఎక్కువగా జరిగింది.

ఈ సినిమా రష్ చూసిన విజయ్ దేవరకొండ అసంతృప్తికి లోనయ్యాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.  గత సినిమాలతో పోలిస్తే కొన్ని సీన్లు అంతగా ప్రభావం చూపవని విజయ్ దేవరకొండ భావిస్తున్నారట.

దాంతో కొన్ని సీన్స్ రీ షూట్ చేయమని విజయ్ దేవరకొండ నిర్మాతలను కోరడం..వారు కూడా అందుకు అంగీకరించడం జరిగిందని ఫిలిమ్ వర్గాల టాక్. ఈ కారణంతోనే సినిమా మరింత ఆలస్యం అవుతుందని అటున్నారు.  అయితే మే Tags:reason31 వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: