దాదాపు దశాబ్ద కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూసిన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కి "గరుడ వేగా" చిత్రం మంచి సక్సెస్ ని ఇచ్చింది. ఈ చిత్రంతో తానేంటో మరోసారి పూర్తిచేసుకున్న రాజశేఖర్, ఆ చిత్రం తర్వాత వెంటనే సినిమాలు చేయకుండా..తనకి నప్పే కథలనే ఎంచుకుంటున్నారు.  ఇక ప్రస్తుతం ఆయన "ఆ!" చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో "కల్కి" చేస్తున్న సంగతి తెలిసిందే..

షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలై అందరి ప్రశంసలు అందుకుంది,  టీజర్ చాలా కొత్తగా ఉండటంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..దీంతో ఈ చిత్ర రైట్స్ కి భారీగా మార్కెట్ ఉందని తెలుస్తోంది. ఇక ప్రముఖ నిర్మాత  రాధామోహన్, ఈ సినిమాకు సంబంధించిన ఏపీ, నైజాం థియేట్రికల్ రైట్స్ ను భారీ మొత్తానికి  దక్కించుకున్నారు.  ఇక ఆంధ్ర రైట్స్ కూడా ఒక బడా నిర్మాత భారీ ధర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇటు ఆంధ్ర, నైజాంలోనే కాదు ఓవర్సీస్ లో కూడా "కల్కి"కి మంచి ఆఫర్స్ ఏ వస్తున్నాయట,  వీటితో పాటు సాటిలైట్ రైట్స్ కి కూడా స్టార్ రేటింగ్ ఉన్న ఛానెల్స్ మధ్య భారీ పోటీ నెలకొందిట, వీటన్నిటితో పాటు  డిజిటల్ రైట్స్ కూడా ఉండడంతో "కల్కి" చిత్రానికి విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ వచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రేంజ్ బిజినెస్ రాజశేఖర్ సినిమాకు ముందెన్నడూ జరగలేదు. 

ఇక ప్రస్తుతం టాకీ పార్ట్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆదా శర్మ, నందిత  శ్వేతలు కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తుండగా శివాని, శివాత్మికలు సమర్పిస్తున్నారు. "గరుడ వేగా" చిత్రంలానే ఈ చిత్రంతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని రాజశేఖర్ కోరుకుంటున్నారు, మరి ఆయన కోరిక నెరవేతుందో లేదో తెలియాంటే మే 17వరకు ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: