మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం "సైరా నరసింహ రెడ్డి", "బాహుబలి" సినిమా తర్వాత తెలుగులో అత్యంత క్రేజ్ ఉన్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, బ్రహ్మాజీ, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ మొదలగు ప్రధాన తారాగణం నటిస్తున్నారు. 
 
ఇక ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండగా , కెమెరామెన్ గా రత్నవేలు పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, చిరంజీవి లుక్స్ ఈ చిత్రంపై అంచనాలను అంతకంతకు పెరిగిపోతుండటంతో ఈ చిత్ర బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ చిత్ర నైజం హక్కుల కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఏషియన్ సునీల్ మధ్య తీర్వమైన పోటీ నెలకొంటున్న సమయంలో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా ఈ చిత్ర నైజం హక్కుల కోసం ట్రై చేస్తున్నారట, ఈ మధ్యనే "కాంచన3" నైజంలో పంపిణి చేసి లాభాలు తెచ్చుకున్న సుధాకర్ రెడ్డి, "సైరా" సినిమా హక్కుల కోసం మెగా కాంపౌండ్ సభ్యులతో మాట్లాడుతున్నారట. 

అయితే నిర్మాణ విషయాల్ని దగ్గరుండి చూసుకుంటున్న రామ్ చరణ్ కి నిర్మాత దిల్ రాజు, ఏషియన్ సునీల్, సుధాకర్ రెడ్డి ముగ్గురు మంచి ఆప్తులు కావడంతో ఈ చిత్ర హక్కులను ఎవరు సంపాదించుకుంటారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: