టాలీవుడ్ లో రవితేజ తో ‘భద్ర’, పవన్ కళ్యాన్ నటించిన గుండుంబా శంకర్ గుర్తుందా..ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్ తెలుగు, తమిళ, మాళియాళ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నది.  హీరోయిన్ గా మంచి ఫామ్ లో కొనసాగుతున్న మీరా జాస్మిన్ 2014లో అనిల్‌జాన్‌ టైటిస్‌ అనే ఇంజినీర్‌ను పెళ్లి చేసుకొని దుబాయ్ కి వెళ్లిపోయింది.  సాధారణంగా హీరోయిన్లుగా కొనసాగుతున్న సమయంలో జీరో సైజ్ మెయింటేన్ చేసినవారు వివాహం జరిగిన తర్వాత బొద్దుగా ఆంటీలుగా మారిపతుంటారు. 

పెళ్లి తరువాత ఆ మధ్య ఇండియాకు తిరిగొచ్చిన మీరా చెన్నైలో ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లింది. అప్పుడు  మీరా జాస్మిన్ పర్సనాలిటీ చూసి అసలు ఈమె ఆ హీరోయినేనా అన్న అనుమానం వచ్చింది.  ఎందుకంటే ఊహించని విధంగా మీరా లావెక్కింది. అసలు ఆమె మీరా జాస్మిన్ కాదని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి.  ఇది అప్పటి విషయం..కానీ ఇప్పుడు మీరా జాస్మిన్ ని చూస్తే నిజాంగా షాక్ అవుతారు. 

చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడానికి మీరా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.  రీసెంట్ గా ముంబైలో మలయాళం డైరెక్టర్ అరుణ్ గోపి మీరా జాస్మిన్ ని కలిశాడు. అక్కడ ఆమెతో కలిసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఒక్కసారిగా ఆ పిక్ వైరల్ అయ్యింది. సినిమాల్లోకి రానుందని అందుకే ఫిట్ నెస్ లో మార్పులు చేసినట్లు టాక్ వస్తోంది. మరి మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: