రామ్ గోపాల్ వర్మ లానే అతని శిష్యులు కూడా చాలా స్పెషల్ గా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు, ఏ విషయాన్నైనా సూటిగా సుత్తిలేకుండా చెప్పడం వర్మ గ్యాంగ్ కె చెల్లుతుంది..ఇటీవలే వర్మ స్టైల్ లోనే తన శిష్యుడు కూడా తనదైన శైలిలో ట్వీట్ చేశాడు, ఇంతకీ విషయం ఏంటంటే..
గత ఏడాది "ఆరెక్స్ 100" చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగా నటించిన ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పెద్ద విజయం సాధించి, దర్శకుడిగా అజయ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఆయన తర్వాతి ప్రాజెక్టుపై కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తినెలకొంది.
అయితే మొదటి సినిమా విడుదలయ్యి చాలా కాలం అవుతున్నా అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్ఫర్మేషన్ లేకపోవడంతో నెట్లో రోజుకొక వార్త పుట్టుకొస్తుంది, దీని తర్వాత కొత్త సినిమాను అజయ్ ప్రకటించలేదు. తొలుత రామ్ హీరోగా అజయ్ సినిమా తీయబోతున్నారని వార్తలొచ్చాయి అయితే రామ్ -పూరి కాంబినేషన్ లో "ఇస్మార్ట్ శంకర్" తో బిజీగా ఉండడంతో తాజాగా నాగచైతన్య ఆయన రెండో సినిమాలో నటించబోతున్నారని, ఆయన పోలీసు అధికారి పాత్రను పోషించబోతున్నారని రాశారు. ఇక ఇందులో సమంత కూడా నటిస్తునట్లు వార్తలొచ్చాయి.
అయితే ఈ వద్దంతులపై అజయ్ గట్టిగా స్పందించాడు, "నా రెండో సినిమా ఎప్పుడు, ఎవరితో, ఎలా తీయాలో నాకు తెలుసు. దయచేసి వదంతుల్ని ఇక ఆపండి" అని ఆయన ట్వీట్ చేశారు, అయితే ఈ ట్వీట్ కి హీరో కార్తికేయ పగలబడి నవ్వుతున్న ఎమోజీలను పెట్టడం విశేషం. ఇక ఈ దర్శకుడి నుండి రెండో ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.