టాలివుడ్ లోని అగ్ర నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు, దాదాపు టాలీవుడ్ లోని యువ కధానాయకులందరితో సినిమాలు నిర్మించిన రాజు "విక్టరీ" వెంకటేష్,  "కింగ్" నాగార్జున లతో చిత్రాలు నిర్మించి సూపర్ హిట్స్ ని అందుకున్నారు. అయితే దిల్ రాజుకి ఎప్పడినుండో తీరని కోరిక ఉందిట.. 

 నందమూరి బాలకృష్ణ తో ఎప్పటినుండో ఒక సినిమాని నిర్మించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు, ఇందుకోసం హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కథను సిద్ధం చేసాడని ఆ మధ్య టాక్ వచ్చింది.  అయితే ఆ ప్రాజెక్ట్ ఏమి వర్కౌట్ కాలేదు.
అయితే ఇప్పుడు తాజాగా మరోసారి దిల్ రాజు కాంపౌండ్ లో బాలయ్య కోసం కథను సిద్ధం చేయిస్తున్నాడట దిల్ రాజు.  అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే కథను బాలయ్యకు వినిపించే పనిలో ఉన్నాడట రాజు. 

ప్రస్తుతం బాలయ్య కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని మొదలుపెట్టాడు.ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. "జై సింహా" కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహేష్ "మహర్షి" చిత్రంతో బిజీగా ఉన్న దిల్ రాజు ఇటీవలే రాజ్ తరుణ్ తో "ఇద్దరి లోకం ఒక్కటే" చిత్రాన్ని ప్రారంభించాడు.  
దీంతో వీరిద్దరి ప్రాజెక్ట్స్ పూర్తయిన తరువాతే వీరి కాంబినేషన్ లో సినిమా ఉండే అవకాశముంది. మరి బాలయ్య దిల్ రాజు చెప్పిన కథకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చి తన కోరికను తీరుస్తాడో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: