"అర్జున్ రెడ్డి" లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలివుడ్ కి ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే,  తొలి సినిమానే బ్లాక్ బస్టర్ అవ్వడం.. అందులో పెరఫార్మెన్స్ ఉన్న పాత్రలో అందరిని మెప్పించడంతో షాలిని త్వరగా టాప్ ప్లేస్ కి చేరుతుంది  అనుకున్నారంతా అయితే షాలినికి అనుకున్నంత రేంజ్ లో అవకాశాలు రాలేదు. 

దీంతో రేస్ లో వెనకబడిన షాలినికి దిల్ రాజు అవకాశం ఇచ్చాడు. రీసెంట్ గా రాజ్ తరుణ్ తో ఒక దిల్ రాజు ఒక చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే, "ఇద్దరి లోకం ఒక్కటే" అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి మొదట మేఘ ఆకాష్ కధానాయికగా అనుకున్నారు, అయితే అనుకోని విధంగా మేఘ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. 

దీంతో ఇప్పుడు దిల్ రాజు  షాలిని పాండే ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.  ఇక ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్తో జోడిగా "118" చిత్రంలో గ్లామర్ గా మెప్పించిన షాలిని అయితే తన కథకు సరిపోతుందని దిల్ రాజు ఆలోచన, దీంతో మంచి బ్రేక్ కోసం చూస్తున్న షాలినికి ఇదో సదవకాశంలా దొరికింది. జూన్ మొదటి వారం నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో కృష్ణ అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.

ఇక ఈ చిత్రం శాలినితో పాటు హీరో రాజ్ తరుణ్ కి కూడా అత్యంత కీలకమైనది అని చెప్పాలి. హిట్ అనే పదం చూసి చాలా కాలం అయిన రాజ్ తరుణ్ కెరీర్ ని "ఇద్దరి లోకం ఒక్కటే" డిసైడింగ్ ఫాక్టర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి వీరి అంచనాలను "ఇద్దరి లోకం ఒకటే" నిజం చేస్తుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: