సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు ఈ స్నిమా నిర్మించారు. డిఎస్పి మ్యూజిక్ తో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.


మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1 బుధవారం సాయంత్రం నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో జరిగింది. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ అటెండ్ అవగా యువ హీరో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. మహర్షి తన 25వ సినిమా కాబట్టి రాజకుమారుడు నుండి మహర్షి వరకు తన దర్శకులందరి గురించి ప్రస్థావించాడు మహేష్.


ఇక ట్రైలర్ వెంకటేష్ రిలీజ్ చేశారు. ట్రైలర్ విషయానికొస్తే ప్రపంచాన్ని ఏలేద్దామనుకున్న రిషి.. లైఫ్ లో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అన్నదే తెలియని రిషి ఏం చేశాడు అన్నది మహర్షి కథ. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మహేష్ స్టైల్, క్యారక్టర్ లో డిఫరెంట్ వేరియేషన్స్ సినిమాకు మరింత హైలెట్ కానున్నాయి.


ఇక ట్రైలర్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టాడు మన సూపర్ స్టార్. రిలీజైన 4 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ టచ్ చేయగా 8 గంటల్లో మహర్షి ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ సాధించింది. ఫైనల్ గా మహర్షితో మహేష్ మరో సంచలన విజయం తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. మే 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: