పవిత్ర ఆంటీ చాలా సినిమాల్లో తల్లి క్యారెక్టర్ లో నటించింది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా విశేషాలతో పాటు సినీ హీరోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలుచేశారు. ‘నటనలో కమల్ హాసన్‌ని వేరొకరితో పోల్చలేం.. అలాగే రజనీకాంత్ అద్భుతమైన నటుడు అన్నారు సీనియర్ నటి పవిత్ర లోకేష్. ఈ సందర్భంగా సీనియర్ హీరోలతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్న ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే.. చిరంజీవి గారిని ఎప్పుడూ కలవలేదు. ఆయనతో నటించే అవకాశం కూడా రాలేదన్నారు.


ఇక అక్కినేని నాగార్జున గురించి మాట్లాడుతూ.. నాగార్జునని కలిశా కాని మాట్లాడలేదు. అంత ధైర్యం లేదు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాగార్జున ‘గీతాంజలి’ సినిమా చూశా. ఆ టైమ్‌లో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా.. ఇలాంటి మ్యాన్ ఉండాలి నా లైఫ్‌లో అని. అలా నాగార్జునపై క్రష్ ఉండేది. దాన్ని క్రష్ అనుకోండి ఏదో ఒకటి అనుకోండి. రెండు మూడు సార్లు ఆయన్ని కలిశా. అదే నా ఫస్ట్ క్రష్ అనుకోవచ్చు అని చెప్పారు.


ఇక అతని తరువాత మళ్లీ ఎప్పుడు క్రష్ మొదలైందో చెప్పుకొచ్చారు. నాగార్జున తరువాత విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌పై క్రష్ ఉండేదన్నారామె. ‘ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశా. నేను నార్మల్‌గా ఉండలేకపోయేదాన్ని. ఆయనపై చాలా రెస్పెక్ట్ ఉండటంతో దూరంగా వెళ్లి కూర్చునే దాన్ని. ఆయన పిలిచినప్పుడు వెళ్లి మాట్లాడేదాన్ని. ఆయనపై ఉన్న క్రష్ నన్ను దూరంగా ఉండేట్టు చేసింది’ అంటూ తెగ సిగ్గు పడిపోతూ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు పవిత్ర

మరింత సమాచారం తెలుసుకోండి: