ప్ర‌పంచ‌వ్యాప్తంగా  అవెంజ‌ర్స్  ఎండ్‌గేమ్ మేనియా న‌డుస్తోంది.  సినిమా ప్రేక్ష‌కుల‌ను  ఉర్రూతలు ఊగిస్తోంది.. ఈ సినిమా చూసేందుకు  ప్రేక్ష‌కులు ధియేట‌ర్ల ద‌గ్గ‌ర పోటెత్తుతున్నారు. అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్  దెబ్బ‌కు బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌వుతోంది. ఏ థియేట‌ర్ చూసినా.. హౌస్‌పుల్ క‌లెక్షన్ల‌తో క‌నిపిస్తోంది. ప్రేక్ష‌కులు ఈ సినిమాను థియేట‌ర్ల‌లోనే  చూసేందుకు ఆస‌క్తి చూపుతుండ‌టంతో అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ క‌లెక్ష‌న్ల‌ సునామీతో దూసుకుపోతోంది.


ఇక అవెజంర్స్ ఎండ్‌గేమ్ క‌లెక్ష‌న్ల‌ విష‌యానికొస్తే..  ఇండియాలో ఈ సినిమా అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. ఇప్ప‌టికే  244.33 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం. ఇక రానున్న రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇండియాలోనే ఈ ఏడాదిలో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమాగా అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ రికార్డు సృష్టించింది.


ఈ ఏడాదిలో మొన్నటి వ‌ర‌కు బాలీవుడ్  మూవీ యూరి ది సర్జికల్ స్ట్రైక్ 240 కోట్ల గ్రాస్‌ను రాబట్టి మొద‌టి స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ ఆ సినిమా రికార్డుల‌ను బ్రేక్ చేసింది. ఈ వారం ఎండ్ క‌ల్లా క‌లెక్ష‌న్లు మరింత‌ పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి అంటున్నారు మూవీ ప్ర‌ముఖులు. మొత్తానికి చూసుకుంటే అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: