ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తాజాగా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని "నీది నాది ఒకే కథ" దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి "విరాట పర్వం" అనే పేరును ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ చిత్ర నేపధ్యం ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే కథగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో టబు, ప్రియమణిలు కూడా నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో సాయిపల్లవిని కథానాయికగా ఎంచుకున్నారు. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల మొదలవ్వకపోవడంతో సాయిపల్లవికి డేట్స్ విషయంలో చాలా ఇబ్బందిపడుతుందిట. చేతి నిండా సినిమాలు ఉండడంతో ఈ చిత్రానికి డేట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోతుందిట దీంతో సినిమా యూనిట్ ని త్వరగా డేట్స్ కుదుర్చుకోమని చెబుతోందిట, లేని పక్షంలో సినిమా నుంచి తప్పుకుంటానని యూనిట్ సభ్యులను హెచ్చరిస్తోందిట..

 జనరల్ గా సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థలో పనిచేయాలని అందరు ఆశిస్తారు, కానీ సాయి పల్లవి ఏకంగా సినిమా యూనిట్ నే హెచ్చరిస్తుండటంతో ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: