పూజ హెగ్డే.. ఇప్పుడు టాలివుడ్ లో టాప్ గా వినిపిస్తున్న పేరు ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో నటించిన పూజ ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ 25వ చిత్రం "మహర్షి" లో కూడా పూజ నే హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.  అయితే తాజాగా పూజ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. 

తమిళంలో సిద్దార్థ్ హీరోగా నటించిన "జిగర్ దందా" చిత్రాన్ని తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతుండగా మిళ యువ హీరో అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించనున్నాడు. 

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకున్నారుట చిత్రబృందం.  వరుణ్ తేజ్ మొదటిచిత్రం "ముకుంద " చిత్రంలో వరుణ్ -పూజలు కలిసి నటించారు.  ఇప్పుడు మరోసారి ఈ జంట వెండితెరపై కనిపించనుండడటం విశేషం. ఇక ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు చిత్ర
బృందం.  


మరింత సమాచారం తెలుసుకోండి: