టాలీవుడ్ లో ఒకప్పుడు తమ అందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటీమణులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అమ్మ, అత్త, అమ్మమ్మ పాత్రల్లో నటింస్తున్నారు.  జయసుధ లాంటి నటీమణులు అమ్మమ్మ పాత్రల్లో నటిస్తుంటే..రమ్యకృష్ణ, నదియా, ఖుష్బు,మీనా లాంటి హీరోయిన్లు  అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తున్నారు.  ఒకప్పుడు టాలీవుడ్ లో లేడీఅమితాబచ్చన్ గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి అప్పట్లో  ఏఎన్ఆర్, శోభాన్ బాబు, చిరంజీవి, కృష్ణ, బాలకృష్ణలతో ఎన్నో సినిమాల్లో నటించారు. 


ఆ తర్వాత ఎక్కువగా లేడీఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ అమితాబచ్చన్ గా పేరు తెచ్చుకున్నారు.  కొంత కాలం క్రితం విజయశాంతి సినిమాల ఏవీ నడవకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చారు.  అయితే ఆ మద్య విజయ శాంతి తిరిగి సినిమాల్లోకి వస్తుందని వార్తలు వచ్చాయి.  కానీ ఆమె మాత్రం ఇప్పుడు ఆ ఆలోచన లేదని తేల్చి చెప్పారు.  తాజాగా ఇప్పుడు మహేశ్ బాబు 26వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనుండగా, నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరిస్తున్నారు.  అయితే ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అంతే కాదు ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది. 


అయితే ఈ ఇద్దరు ఒకప్పుడు టాప్ హీరోయిన్లే..మరి ఇందులో ఏ పాత్రలో నటిస్తున్నాన్నది సస్పెన్స్ గా కొనసాగుతుంది. అయితే  ఈ సినిమాలో మహేశ్ బాబుకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందనీ .. అత్త పాత్రను విజయశాంతి పోషించనుందనేది తాజా సమాచారం. గపతిబాబు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.  భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: