పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "హార్ట్ అటాక్" చిత్రంతో నితిన్ సరసన మెరిసింది ఆదా శర్మ, మొదటిసినిమాతోనే అందరిని అక్కటుకున్న ఈ ముద్దుగుమ్మ "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్"  "సన్ అఫ్ సత్యమూర్తి" చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి పేరే తెచ్చుకుంది. 
అయితే తెలుగులో ఈ భామకు ఇప్పుడు ఆశించిన అవకాశాలు లేకపోవడంతో ఈ భామ ఇప్పుడు హిందీ సినిమాలపై ఎక్కువ ద్రుష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె అబీర్‌సెన్‌ గుప్తా దర్శకత్వంలో వస్తున్న "మెన్ టు మెన్" చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆదా పాత్ర గురించి ఇప్పుడొక ఆసక్తికర విషయం తెలిసింది. 
అదేంటంటే ఈ చిత్రంలో ఆదాశర్మ ఒక ట్రాన్సజెండర్ పాత్రలో కనిపించనుందిట, కథలో చాలా కీలకమైన ఈ పాత్రను ఎంతో ఛాలెంజింగ్ గా చేసిందిట ఆదా శర్మ, ఇక ఈ పాత్ర గురించి దర్శకుడు మాట్లాడుతూ "ఎంతో విభిన్న పాత్రను ఆదా చాలా కష్టపడి నటించింది" అని తెలిపారు. ఇక చాలా కాలంగా పెరఫార్మెన్స్ ఉన్న రోల్ కోసం ఎదురుచూస్తున్న ఆదాకు ఈ పాత్ర పేరు తెస్తుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: