టాలీవుడ్ లో ఆ మద్య దర్శకుడు హరీష్ శంకర్,  పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’మూవీ ఎన్నో సంచలనాలు క్రియెట్ చేసింది.  అప్పటి వరకు ఫ్లాపులతో పీకల్లోతుల్లో ఉన్న పవన్ కళ్యాన్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చింది.  బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబంగ్’సినిమా రిమేక్ గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’పవన్ కళ్యాన్ స్టార్ డమ్ ని ఎక్కడికో తీసుకు వెళ్లింది. దాంతో పవన్ కళ్యాన్ మాస్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించారు పవన్ కళ్యాన్.  అయితే ఇంత గొప్ప సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేక పోయారు.  


ప్రస్తుతం హరీష్ శకర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘వాల్మీకి’ సినిమా తీస్తున్నారు.  ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని అనుకుంటున్నారని, దానికి ఆమె ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో హీరయిన్ ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.  ఈ విషయం అఫిషియెల్ గా తెలియాల్సి ఉంది.

ఇక గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమా తర్వాత పవన్ తో మరో సినిమా చేస్తానని అప్పట్లో హరీష్ శంకర్ అన్నారు..కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. 

అయితే పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని, అయితే రీసెంట్ గా పవన్ ని కలిసినట్లు వస్తోన్న వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశారు. ఇక  నిర్మాతల నుండి కానీ అధికార ప్రకటన వచ్చే వరకు సినీ అభిమానులందరూ ఎదురుచూడాలంటూ రిక్వెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: