టాలీవుడ్ లో హాట్ బ్యూటీలుగా పేరు తెచ్చుకున్న త్రిష, చార్మీ లకు సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.  ఒకప్పుడు దక్షిణాది స్లిమ్ బ్యూటీగా త్రిష, బొద్దుముద్దుగుమ్మగా ఛార్మీలు స్టార్ హీరోల సరసన నటించారు.  ఈ ఇద్దరు నటీమణుల మద్య మంచి స్నేహం ఉందన్న విషయం తెలిసిందే.  తాజాగా త్రిష పుట్టిన రోజు సందర్బంగా చార్మీ ఓ వెరైటీ ట్విట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 


 "బేబీ ఐ లవ్యూ. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రపోజల్ ను ఎప్పుడు అంగీకరిస్తావా అని ఎదురుచూస్తున్నా. మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడిది చట్టబద్ధమేనట!" అంటూ కవ్వించేలా ట్వీట్ చేసింది.  గతంలో కూడా ఇలాంటి ట్విట్ చార్మీ, త్రిష మధ్య రావడం సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం జరిగింది.  అప్పుడు చార్మీ పెళ్లి ప్రపోజల్ తీసుకురాగా, త్రిష ఓకే చెప్పింది.  


ఈ ఇద్దరు ముద్దుగుమ్ములు ఇప్పుడు మూడు పదులు నిండాయి..కానీ త్రిష మాత్రం ఇంకా స్లిమ్ గా ఇప్పడే వెండి తెరకు పరిచయం అయిన హీరోయిన్ గా ఉంటుంది. అయితే చార్మీ మాత్రం కొంత కాలంగా మూవీస్ కి గుడ్ బాయ్ చెప్పింది.  ప్రస్తుతం  పూరీ జగన్నాథ్ భాగస్వామ్యంలో పూరీ కనెక్ట్ సంస్థలో ఆమె ఎగ్జిక్యూటివ్ గా అనేక సినిమాల నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’సినిమాలో వీరిద్దరు అక్కాచెల్లెలుగా నటించారు..అప్పటి నుంచి వీరి మద్య స్నేహం కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: