తెలుగు సినిమా దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావుగారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. భక్తిని, రక్తిని వెండితెరపై చూపించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న దర్శకుడు ఆయన. ఇక నాగార్జున నటించిన భక్తిరస చిత్రం "ఓం నమో వెంకటేశయ" చిత్రం తరువాత రాఘవేంద్రరావు మరో సినిమాను తెరకెక్కించలేదు. 

అయితే తాజాగా రాఘవేంద్రరావుతో మళ్ళీ దర్శకత్వం చేయాలనీ ఆయన శిష్యులు సత్యానంద్, కీరవాణీలు ఆయన్ని కోరారట, వాళ్ళ కోరికను కాదనలేని రాఘవేంద్రరావు మరోసారి దర్శకుడిగా మారేందుకు సిద్దమయ్యారుట. ఇందుకోసం ఇప్పటి ట్రెండ్ కి తగట్టు మంచి కమర్షియల్ కథను వెతుకుతున్నారట. 

ఇదిలా ఉండగా రాఘవేంద్రరావుకి రచయిత బి.వి.యస్.రవి ఒక మంచి కమర్షియల్ కథను వినిపించారట, "పెళ్ళిసందడి" టైప్ లో ఉండే ఈ చిత్ర కథ రాఘవేంద్రరావుకి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి నూతన నటి నటులతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేయబోతుననట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: