ప్రముఖ గాయని గాన కోకిల ఎస్ జానకి , మైసూరులోని ఒక ప్రైవైట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం, ఇటీవల మైసూరులోని ఆమె బంధువుల ఇంటికి వెళ్లిన జానకి అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారీ పడినట్లు సమాచారం.ఆవిడ వయసు 81వ సంవత్సరాలు.  
దీంతో ఆవిడ కుడికాలుకి ఫ్రాక్చర్ అయ్యిందట. దెబ్బ పెద్దదిగా తగలడంతో కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవకాల్సిందిగా డాక్టర్లు ఆవిడకి సూచించారట. అయితే ప్రస్తుతం జానకి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. 
ఇదిలా ఉండగా తమ అభిమాన గాయని ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియడంతో ఆవిడ అభిమానులంతా ఆవిడ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆవిడ కోలుకొంటుడంతో త్వరలోనే ఆవిడని ఇంటికి డీఛార్జ్ చేసే యోచనలో ఉన్నారు వైద్యులు. భరత చలన చిత్రానికి చెందిన భాషలు అన్నిటిలో వేలాది పాటలు పాడి అశేష అభిమానాన్ని చొరగొన్న జానకి అమ్మ త్వరలోనే కోలుకోవాలని ఆశిద్దాం.





మరింత సమాచారం తెలుసుకోండి: