తెలుగులో ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరికి గుర్తొచ్చే పేరు కియారా అద్వానీ,  మహేష్ బాబు "భరత్ అనే నేను" తో హీరోయిన్ గా తెలుగు తెరకు  పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. కానీ రెండవ సినిమా "వినయ విధేయ రామ" డిజాస్టర్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం వెల్లువలా వస్తునే ఉన్నాయి 

అయితే ఆమె పేరు విషయంలో అందరికి ఒక డౌట్ ఉంది అది, ఆవిడని కైరా అనాలా లేక కియారా అని పిలవాలా అనే సందేహం అందరిలో నెలకొంది. దీనిపై కియారా స్పందిస్తూ " నా అసలు పేరు కియారా కానీ అందరు   కైరా అని పిలుస్తూ ఉంటారు.దీంతో నాకు కోపం వస్తుంది అని తెలిపింది. 
 
ఇక సినిమాల పరంగా ఈమె ప్రస్తుతం "అర్జున్ రెడ్డి"  రీమేక్ అయిన "కబీర్ సింగ్" సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది. అంతేకాక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన "గుడ్ న్యూస్" సినిమాలో కూడా నటిస్తోంది. ఇక కాంచన ఇది రీమేక్ లో కూడా కియారా నే నాయిక


మరింత సమాచారం తెలుసుకోండి: