ఇటీవల నందమూరి తారకరామారావు జీవితం సంబంధించిన బయోపిక్ తీసి రెండు ప్లాపులు అందుకున్నాడు డైరెక్టర్ క్రిష్. అయితే ఈ రెండు సినిమాలు చేయకముందే బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘మణికర్ణిక’ అనే భారీ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసి సినిమా చివర్లో ఉందనగా హఠాత్తుగా ప్రాజెక్టు నుండి క్రిష్ బయటకు వచ్చేయడం జరిగింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు క్రిష్.

Image result for krish director

అయితే వరుసగా చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవడంతో తిరిగి బాలీవుడ్లో తనకు మంచి పేరు ఉన్న నేపథ్యంలో అక్కడే ఒక భారీ హిట్ కొటే ఆలోచనలో డైరెక్టర్ క్రిష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో 'గబ్బర్ ఈజ్ బ్యాక్' పేరుతో రీమేక్ చేసాడు క్రిష్. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు...అప్పట్లో ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కలెక్షన్లు రాబట్టి అక్షయ్ కెరీర్లోనే ఒక మైలురాయిగా సినిమాగా నిలిచిపోయింది.

Image result for krish akshay kumar

దీంతో ఇప్పుడు మళ్ళీ అక్షయ్ కుమార్ తో ఒక సినిమా చేయాలనీ క్రిష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుమూలంగా అక్షయ్ కి ఒక స్క్రిప్ట్ ను వినిపించిన క్రిష్ పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని డౌట్ లు అడిగినప్పటికీ అక్షయ్ నెక్స్ట్ క్రిష్ తో చేయాలనీ అనుకుంటున్నాడట. అయితే అన్నీ వర్కౌట్ అయితే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో క్రిష్- అక్షయ్ ఉన్నట్లు సమాచారం. ఇటీవలే మోడీ బయోపిక్ తీసి మంచి పేరు సంపాదించుకున్న అక్షయ్ ...క్రిష్ చెప్పిన స్టోరీ పై కూడా గట్టిగానే నమ్మకం పెట్టుకున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: