టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న రవితేజ వరుస డిజాస్టర్లతో రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.  రెండేళ్ల విరామం తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’సినిమాతో తన మాస్ ఇమేజ్ మరోసారి చూపించాడు.  రాజాది గ్రేట్ హిట్ తర్వాత తనకు ఎదురు లేదు అనుకున్న సమయంలో వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.  దాంతో తన తదుపరి సినిమాపై శ్రద్ద వహిస్తున్నారు రవితేజ.   

తాజాగా రవితేజ, వి.ఐ.ఆనంద్‌ల కాంబినేషన్‌లో ‘డిస్కోరాజా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.   సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఎస్‌.ఆర్‌.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.  నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా  నటిస్తున్నారు. కొద్ది రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందని, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధ్య బడ్జెట్ విషయంలో కొన్ని ఇబ్బందులు తెలత్తడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  అంతే కాదు రవితేజ, గోపిచంద్ మలినేనితో సినిమా చెయ్యబోతున్నాడని రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలపై మూవీ యూనిట్ స్పందించింది. 


సోషల్ మీడియాలో ఈ మద్య ‘డిస్కో రాజా’పై ఎన్నో రూమర్లు వస్తున్నాయని..అవన్నీ అవాస్తవాలని అందులో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు.  ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసాం, అవుట్‌పుట్ బాగా వచ్చింది. సైన్స్ ఫిక్షన్ కథ కావడంతో గ్రాఫిక్స్ వర్క్‌కి ఎక్కువ టైమ్ పడుతుంది.  ఈ సినిమా విషయంలో డైరెక్టర్, నిర్మాత మంచి ప్లాన్ లో ఉన్నారని అన్నారు.  కాకపోతే ఈ మద్య సెకండ్ షెడ్యూల్ లో గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే అని..అంత మాత్రాన సినిమా ఆగిపోయిందని వార్తలు రావడం ఇబ్బందికి గురి చేసిందని అన్నారు చిత్ర యూనిట్. 

మే 27 నుండి, జూన్ 21 వరకు హైదరబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుతాం'.. అని నిర్మాత చెప్పారు. థమన్ ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేసినట్టు ట్వీట్ చేసాడు. డిస్కోరాజాని 2020 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.


మరింత సమాచారం తెలుసుకోండి: