టాలీవుడ్ లోకి ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా పరిచయం అయ్యారు.  బాలనటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడిగా కొనసాగుతున్న సాయి కుమార్ ఆ మద్య కన్నడ మూవీలో హీరోగా నటించారు.  ఆయన నటించిన ‘పోలీస్ స్టోరీ’ సినిమా కన్నడ, తెలుగు భాషట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు గా స్థిరపడిపోయిన సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ ‘ప్రేమకావాలి’సినిమా హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవి యావరేజ్ టాక్ వచ్చాయి. 


తాజాగా ఆది హీరోగా మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరో, హీరోయిన్స్‌గా, రైటర్ డైమండ్ రత్నబాబుని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ, దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై, హెచ్.కె.శ్రీకాంత్ దీపాల, కిషోర్ నిర్మిస్తున్న సినిమా  బుర్రకథ.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా టీజర్ ని బట్టి చూస్తే ఆది సాయికుమార్ రెండు బ్రెయిన్లు వున్న యువకుడిగా కనిపించనున్నాడని అర్థమవుతోంది. 


ఒక బ్రెయిన్ ఒకలా.. మరో బ్రెయిన్ ఒకలా పనిచేస్తూ ఉంటాయి. హీరో అలవాట్లు..అభిరుచులు రక రకాల వేరియేషన్స్ కనిపిస్తూ వుంటాయి. ఈ సమస్య కారణంగా హీరో ఎలాంటి ప్రమాదంలో పడతాడు? ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడతాడు? అనే కథాంశంతో ఈ సినిమా సాగనుంది. ఇక టీజర్ చివర్లో, 'ఇంకేమింకేంమింకేం కావాలే'.. అని ఆది పాడితే, 30 ఇయర్స్ పృథ్వీ.. 'ఒక ఇత్తడి చెంబు, ఒక వెండి కంచం, ఒక బంగారు మొలతాడు, ఒక కరీంబీడి కట్ట' అంటూ, జంబలకిడి పంబలో బ్రహ్మానందంలా చెప్పడం నిజంగా నవ్వులు ఆపుకోవడం కష్టంగానే ఉంది. 


ఆద్యంతం కామెడీతో సాగిన ఈ టీజర్ మంచి ఎంట్రటైన్ మెంట్ సినిమాల కనిపిస్తుంది. సి.రామ్ ప్రసాద్ విజువల్స్, సాయి కార్తీక్ ఆర్ఆర్ బాగున్నాయి. టీజర్ చూస్తుంటే ఆదికి బుర్రకథ బ్రేక్ ఇచ్చేలానే ఉంది అనిపిస్తుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ : ఎమ్ఆర్ వర్మ, ఆర్ట్ : చిన్నా.


మరింత సమాచారం తెలుసుకోండి: