టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రం "మహర్షి" మే 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ కి 25వ సినిమా కావడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇక విడుదలకి రెండు రోజుల ఉండడంతో  బుకింగ్స్ ఊపందుకున్నాయి ఇప్పటికే మల్టీ  స్క్రీన్లు, మల్టీ ఫ్లెక్స్ లు "మహర్షి" బుకింగ్స్ కి  అన్ని చోట్ల  సౌల్డ్ అవుట్ అనే బోర్డ్స్ పెట్టడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది థియేటర్లు పెంచినా అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. రిలీజ్ కి మూడు రోజుల ముందే, ఈ రేంజ్‌ లో హడావుడి వుంటే ఇక సినిమాకు గాని సూపర్ హిట్ టాక్ వస్తే "మహర్షి" దెబ్బకి నాన్ "బాహబలి" రికార్డ్స్ అన్నీ తుడుచుకుపెట్టి పోయేలా ఉన్నాయి. 

దీంతో జనాల్లో  మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది, ఇక ఈ చిత్రం తర్వాత మహేష్  హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు, త్వరోలనే ఆ చిత్ర షూటింగ్ మొదలుకాబోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: