మహేష్ బాబు అందాల నటుడు, వయసు పెరుగుతోంది కానీ గ్లామర్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికి పాతిక సినిమాలు పూర్తి చేసుకున్న ఈ ఘట్టమనేని అందగాడు కొత్త మూవీ కోసం అపుడే రెడీ అయిపోతున్నారు. మహర్షి మూవీకి అన్ని వైపులా పాజిటివ్ బజ్ రావడంతో సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. దాంతో మంచి హుషార్ మీదున్న మహేష్ ఇపుడు అర్జంట్ గా ఫ్యామిలీ మూవీకి షిఫ్ట్ అవుతున్నాడు.


మహేష్ తరువాతి ప్రాజెక్టు కోసం ప్రీప్రొడక్షన్స్  వేగంగా సాగిపోతున్నాయి. మహేష్ 26వ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యత -‘ఎఫ్ 2’తో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న అనిల్ రావిపూడికి దక్కడం తెలిసిందే. ఇంకా సెట్స్‌మీదకు వెళ్లకుండానే, సినిమా పట్ల చిత్రబృందం ఆసక్తి పెంచుతోంది. నటీనటులను ఎంపిక చేసుకోవడంనుంచే ప్రాజెక్టుపై ఫోకస్‌ను పెంచుతున్నట్టు కనిపిస్తోంది. కొత్త ప్రాజెక్టులోకి సీనియర్ హీరోయిన్లు విజయశాంతి, రమ్యకృష్ణలను తీసుకుంటున్నట్టు ఇంతకుముందే వార్తలొచ్చాయి.



 తాజా సమాచారం ప్రకారం మహేష్‌కు రమ్యకృష్ణ అమ్మగాను, విజయశాంతి అత్తగాను కనిపించనున్నారట.  పాత్రల పరిధి, ప్రాముఖ్యతను అనుసరించి సీనియర్ హీరోయిన్లను ఆ పాత్రలకు ఎంపిక చేశారన్న టాక్ వినిపిస్తోంది. చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో జగపతిబాబు విలన్‌గా కనిపించనున్నాడని, జూన్‌నుండి సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని అంటున్నారు. 


ఇప్పటి వరకూ మహేష్‌బాబు చేసిన మురారి, బ్రహ్మోత్సవం చిత్రాల మాదిరిగా స్క్రీన్‌నిండా సీనియర్ల తారాగణం కనిపించే అవకాశం ఉందని, పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామానే అనిల్ కథగా మలుచుకుని ఉంటాడన్న కథనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మహేష్ ఇద్దరు అందాల అతివల మధ్య నలుగుతూ చేసే ఈ పాత్ర ఫ్యాన్స్ కే కాదు ఈ తరం ఆడియన్స్ కి కూడా కొత్తగానే ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి మహేష్ అనిల్ రావి పూడి  డీరెక్షన్లో ఎలా రెచ్చిపోతాడో.



మరింత సమాచారం తెలుసుకోండి: