కింగ్ నాగార్జున హీరోగా తన కెరియర్ లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన మన్మధుడు సీక్వల్ గా మన్మధుడు 2 వస్తుంది. చిలసౌ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. నాగార్జున సరసన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ అక్షర గౌడ్ నటిస్తుండగా వీళ్లిద్దరు చాలరన్నట్టుగా ఈమధ్యనే సమంతతో ఓ స్పెషల్ రోల్ చేయించారు.


అక్కినేని కోడలిగా సమంత మన్మధుడులో ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందని ఆమెను తీసుకున్నారు. ఇక ఇప్పుడు సినిమాలో మరో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో ఓ సర్ ప్రైజ్ రోల్ లో కీర్తి సురేష్ కనిపిస్తుందట. మహానటి తర్వాత తెలుగులో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగింది. అయితే ఆ తర్వాత అనుకున్న ఆఫర్లు రాలేదు. 


ప్రస్తుతం తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న కీర్తి సురేష్ మన్మధుడు-2లో కూడా నటిస్తుండటం విశేషం. కీర్తి సురేష్ క్రేజ్ ను కూడా క్యాష్ చేసుకునేలా అక్కినేని ఫ్యాన్స్ కు పండుగ తెచ్చేలా మన్మధుడు 2 ఉండబోతుంది. ఈ సినిమా కథ కోసం రాహుల్ చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. సినిమాలో నాగార్జునని చూసి అందరు షాక్ అవడం ఖాయమట.  


అప్పుడు మన్మధుడులో ఎలా ఉన్నాడో ఇప్పుడు అదే విధంగా కనిపించేలా నాగార్జున కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో పాటుగా నాగార్జున బంగార్రాజు సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకు రావాలని చూస్తున్నాడు. ఆల్రెడీ కళ్యాణ్ కృష్ణ ఆ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడట్ కాని నాగార్జున ముందు మన్మధుడు 2 ఆ తర్వాతే బంగర్రాజు అని చెప్పడంతో వెయిట్ చేయక తప్పట్లేదు.   



మరింత సమాచారం తెలుసుకోండి: