తమిళ నటుడు సూర్యకి  ఈమధ్య కాలంలో ఆశించిన విజయాలేవి లేవు, దీంతో కథలపై ద్రుష్టి పెట్టిన సూర్య కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో మోహన్ లాల్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత శివ దర్శకత్వంలో ఒక సినిమాకి ఒకే చెప్పాడు సూర్య. 

గోపీచంద్ తో "శౌర్యం" సినిమాతో దర్శకుడిగా  పరిచయం అయిన శివ ఆ తరువాత తమిళ స్టార్ అజిత్ తో వరుసగా "విశ్వాసం" "వివేగం" "వేదాలమ్" "వీరం" చిత్రాలు తీసి  బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు. మాస్ పల్స్ ని బాగా ఆకట్టుకునే శివ, సూర్య కోసం ఒక మంచి మాస్ కథను సిద్ధం చేశాడు. సరైనా మాస్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న సూర్యకి శివ చెప్పిన కథ నచ్చడంతో  సూర్య సినిమా చెయ్యడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం సూర్య నటించిన "ఎన్ జి కె" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రానికి శ్రీరాఘవ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన రకుల్, సాయిపల్లవి హీరోయిన్స్ గా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: