టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అనగానే శోభన్ బాబు గుర్తుకు వచ్చేది. కొంత కాలానికి చిత్ర పరిశ్రమలో ఆ స్థానం జగపతి బాబు తీసుకున్నారు.  ఇద్దరు భార్యలతో నలిగిపోయే భర్తగా పలు సినిమాల్లో నటించారు.  హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన జగపతి బాబు కి పెద్దగా విజయాలు వరించలేదు.  ఒకానొక దశలో ఆయన కెరీర్ కష్టాల్లో పడింది..ఇక సినిమాలకు దూరమైతాడేమో అన్న సమయంలో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు జగపతి బాబు. 

అప్పటి వరకు హీరోగా ఉహించుకున్న ఆయనను తెలుగు ప్రేక్షకులు విలన్ గా చూస్తారా అన్న అనుమానాలు ఉన్నా..లెజెండ్ సినిమాలో తన విశ్వరూపాన్ని చూపించాడు జగపతిబాబు.  అంతే అప్పటి వరకు హీరోగా ఉన్న ఇమేజ్ కన్నా  విలన్ గా నటించిన తర్వాత ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది.  అప్పటి నుంచి తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతిబాబు.

ఆ మద్య ప్రతినాయకుడిగా బెస్ట్ అవార్డు రావడంతో..తనను హీరోగా ఎవరు గుర్తించలేదు..కనీసం విలన్ గా అయినా గుర్తించారు..ధన్యవాదాలు అన్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా సి.కల్యాణ్ నిర్మాణంలో కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో క్రితం ఏడాది తెరకెక్కిన 'జైసింహా'.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.   అయితే వెండి తెరపై మరోసారి ‘లెజండ్’కాంబినేషన్ వస్తుందా అన్న ఆలోచనలో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. 

తాజాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా కెఎస్ రవికుమార్ చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా వుంటుందట. అందువలన చాలామంది పేర్లను పరిశీలించి, చివరికి జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోసారి ఈ ఇద్దరూ తెరపై తలపడనున్నారన్నమాట. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెడ తారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: