ఒక లైలా కోసం, ముకుందా సినిమాలతో అచ్చతెలుగు ఆడపడుచులా కనిపించిన పూజా హెగ్డే ఆ సినిమాలతో పెద్దగా పేరు రాకపోవడంతో టాలీవుడ్ అచ్చి రాలేదని బాలీవుడ్ కి పయణం అయ్యింది. అక్కడ హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో సరసన నటించినా పెద్దగా పేరు రాలేదు. దాంతో టాలీవుడ్ బెటర్ అనుకున్న సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’సినిమాలో నటించింది.
ఆ సినిమాలో పూజా హెగ్డె విచ్చలవిడి అందాలు చూపించింది...లిప్ లాక్ కిస్ తో అల్లల్లాడించింది. ఈ సినిమాలో పూజా హెగ్డె బికినీ సన్నివేశాలతో అందరి మనసు దోచేసింది. అంతే ఆ సినిమా తర్వతా వరుస ఆఫర్లు అందుకుంది. ఆ మద్య ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’..తాజాగా మహేష్ బాబు తో ‘మహర్షి’, ప్రభాస్ తో మరో సినిమాలో నటించబోతుంది. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం నా అదృష్టం.
అయితే ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాంటే టైమ్ షెడ్యూల్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని..ఒకే రోజున ఈ ముగ్గురు హీరోల షూటింగ్స్ లో పాల్గొనవలసింది. ఉదయం 7 నుంచి 12 వరకు ఎన్టీఆర్ .. మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు మహేశ్ తో .. రాత్రి 9 నుంచి ఉదయం 2 వరకూ ప్రభాస్ తో కలిసి పనిచేశాను.బాహుషా ఇలాంటి అదృష్టం నాకే దక్కిందనుకుంటున్నా అంటూ ముసి ముసి నవ్వులు నవ్వింది పూజా హెగ్డె.