ఈ మద్య విక్టరీ వెంకటేష్ ఎక్కువగా మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచి మొన్నటి ఎఫ్ 2 మూవీ వరకు మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తూ వస్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా ‘ఎఫ్ 2 మూవీతో వచ్చారు. కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఎఫ్ 2 సీక్వెల్ కూడా తీస్తున్నారు. తాజాగా వెంకటేష్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఆర్. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన తమిళ్ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా విక్రమ్ వేదా. ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకపోయినా..రిలీజ్ తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. పుష్కర్- గాయత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాధవన్ పోలీస్ ఆఫీసర్గా, విజయ్ సేతుపతి గ్యాంగ్స్టర్గా నటించారు. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో ఈ సినిమాను పలు భాషల్లో రిమేక్ చేయడానికి దర్శక, నిర్మాతలు సిద్దమవుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగులో విక్టరీ వెంకటేష్ ఈ రీమేక్లో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. వి.వి.వినాయక్ డైరెక్షన్లో, మాధవన్ క్యారెక్టర్లో నారా రోహిత్, విజయ్ సేతుపతి రోల్లో వెంకటేష్ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన డి.సురేష్ బాబు వెంకటేష్ విక్రమ్ వేదా తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య మల్టీస్టారర్ మూవీ ‘వెంకిమామ’షూటింగ్ బిజీలో ఉన్నారని..వెంకటేష్ తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తాం.. అని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.