అక్కినేని మూడోతరం వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన నటుడు అఖిల్. హీరోగా మొదటి సినిమా "అఖిల్" తో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన "హలో" అఖిల్ కి ఆశించిన విజయాలను అందించలేదు. ఇక తాజాగా అఖిల్ వెంకీ అట్లూరి సినిమా "మిస్టర్ మజ్ను" చిత్రం కూడా భారీ ప్లాప్ ను చవిచూసింది. దీంతో కథలపై ప్రత్యేక శ్రద్ద పెట్టిన అఖిల్ "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యాడు. 

ఇదిలా ఉండగా అఖిల్-" బొమ్మరిల్లు" భాస్కర్ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ముందుగా ఈ చిత్ర బడ్జెట్ ని గీత ఆర్ట్స్ సగానికి సగం తగ్గిచేసిందిట..దీంతో చేసేది లేక నాగార్జున ఈ మూవీలో ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తోంది. ఇక హీరోయిన్ విషయంలో కూడా చిత్ర బృందం ఒక్క మాటపై ఉన్నట్లు కనిపించడంలేదు, కొత్త అమ్మాయితో చేద్దామని భాస్కర్ అంటుంటే  ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితే మార్కెట్ పరంగా బాగుంటుందని ఫీలవుతోందిట చిత్ర బృందం. 

ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట దేవిశ్రీప్రసాద్ ని అనుకున్నారు అయితే దేవి ట్యూన్స్ ఈమధ్య అంత క్యాచీగా ఉండకపోవడంతో గోపి సుందర్ ని ఎంచుకున్నారు. ఇలా అడుగడునా ఎదో ఒక మార్పులు ఉండడటంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అనే ఆలోచనలో ఉన్నారు అక్కినేని అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: