టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లుగా నటించిన వారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి తల్లి, అత్త పాత్రల్లో నటిస్తున్నారు.  ఒకప్పుడు బబ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రక్ష ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి తల్లి, అత్త పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.   'నచ్చావులే' సినిమాలో హీరో తల్లిగా నటించినందుకు ఆమెకి నంది అవార్డు దక్కింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్రపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న రక్ష తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు తెలియజేసింది.  చిన్నప్పటి నుంచి కూడా నాకు కోపం ఎక్కువ.


కాలేజ్ రోజుల్లో నాకు కొంత మంది కుర్రాళ్లు లవ్ ప్రపోజల్ చేయాలని వచ్చినా..నేను ఎక్కడ తిడతానో..కొడతానో అని భయపడేవారు. నేను హీరోయిన్ అయిన తరువాత నాతో అసభ్యంగా ప్రవర్తించి తన్నులు తిన్నవాళ్లు వున్నారు. తన తండ్రి నిర్మాతగా రెండు సినిమాలు తీసి నష్టపోయారని.. అప్పట్లో కాస్త ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తాను సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పింది.


ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా.. తనకు నచ్చి నటిగా కెరీర్ మొదలుపెట్టినట్లు తెలిపింది. సినీ పరిశ్రమలో తనతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినందుకు సెట్స్ లోనే చెంప ఛెల్లుమనిపించానని చెప్పింది.  ఓ డైరెక్టర్ తనతో సినిమా తీసే ముందు  గ్లామర్ పాత్రల్లో నటించనని  నాకు పెళ్లై  కూతురుంది.. స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోనని చెబితే మొదటి ఓకే చెప్పిన ఆ దర్శకుడు సెట్ కి వెళ్లిన తరువాత తేడాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడట. తనతో డబల్ మీనింగ్ మాటలు..వెకిలి చేష్టలు చేయడం మొదలు పెట్టాడు.


దాంతో విపరీతమైన కోపం వచ్చి దగ్గరకు పిలిచి చెంప ఛెల్లుమనిపించానని..తర్వాత పోలీసలకు ఫిర్యాదు ఇవ్వాలని చూస్తే..హీరో వద్దు మేడమ్ పరువు పోతుందని చెప్పడంతో ఆగిపోయానని అన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం..మీటు ఉద్యమాలు బాగా వస్తున్నాయని..కామాంధులకు ఇది చెంపపెట్టు అని అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: