బాలీవుడ్ సుందరి 'కత్రినా కైఫ్' తాజాగా ఒక ఉద్వేగపూరిత పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ బ్యూటీకి దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అందులో చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ పరిధి దాటి రకరకాల మేసెజ్ లు పెడుతూ ఉంటారు. అయితే తాజాగా ట్విట్టర్ లో ఓ అభిమాని కత్రినా నువ్వు నన్ను పెళ్లి చేసుకో...లేదంటే చచ్చిపోతా అని మెసేజ్ పెట్టాడు.

ఆ మెసేజ్ చదివి తాను చాలా ఏమోషనల్ అయ్యానని.."దేన్ని సీరియస్ గా తీసుకోని మనుషులు ఉన్న ఈ సమాజంలో తన కోసం బలమైన భావోద్వేగంతో ఆ అభిమాని మెసేజ్ చేయడం" నచ్చిందని కత్రినా చెప్పింది. 


సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న 'పించ్' అనే వెబ్ షో లో కత్రినా ఈ విషయాలు వెల్లడించింది. సినిమాలు, కెరీర్ ను దాటి పలు వ్యక్తిగత విషయాలపై కత్రినా ఈ షో లో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పింది.

రణ్‌బీర్ కపూర్ తో బ్రేకప్ అయినప్పటికీ రిలేషన్‌షిప్ పై ఇప్పటికీ కత్రినా నమ్మకంతోనే ఉంది. సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటానని, అయితే ఆ సమయం ఎప్పుడు వస్తుందో తనకు తెలీదంటూ కామెంట్ చేసింది


మరింత సమాచారం తెలుసుకోండి: