మెగా బ్రదర్ నాగబాబు మరోసారి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మద్య బాలకృష్ణపై వరుసగా యూట్యూబ్ ఛానల్ లో కామెంట్స్ చేసిన ఆయన ప్రస్తుతం సొంత ఛానల్ ‘మై ఛానెల్ అంతా నా ఇష్టం’ లో తనకు తోచిన విధంగా మాట్లాతున్నారు.  గత నెలలో ఎన్నికల బిజీలో తిరిగిన ఆయన జనసేన పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ మద్య తెలంగాణ లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే..ఆత్మహత్యలు పరిష్కారమార్గం కాదని చెబుతో ఓ వీడియో వదిలారు. 


తాజాగా మరోసారి ‘మై ఛానెల్ అంతా నా ఇష్టం’  నాగబాబు కొన్ని వందల సంవత్సరాలకైనా ఈ భూమి మీద మతాలు లేకుండా పోతే, చాలా సుఖమైన స్థానం ఈ భూమి అవుతుందని అన్నారు. ‘దేవుడు’ అనే కాన్సెప్ట్ లేకపోతే ఎవరూ దేనికీ భయపడకుండా, విచ్చలవిడి తనం పెరిగిపోతుందేమో? అన్న ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ..అవును ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో భక్తి శ్రద్దలు చూపించే వారు..కానీ ఇప్పుడు దేవుడంటే ఎవరికీ భయం లేదు..ఎదుటి వారిని కొట్టి, హింసించి,భయపెట్టే వారికే భయపడతారు.  అలాంటి వారిని పైన దేవుడు శిక్షిస్తాడు.  అయితే ఇప్పుడు అందరూ భయపేది ‘లా అండ్ ఆర్డర్ కే’ అని అన్నారు. 


ఇక  ‘దేవుడు’, ‘మతం’, ‘స్వర్గం-నరకం’ గురించి ఆయన మాట్లాడుతూ...ఈ ఊహాజనిత అంశం గురించి ఆయన ప్రస్తావించారు. ఇటాంటి రూల్స్ వస్తే..పరమ నిష్టతో దేవుడిని పూజించే వారు..కూడా కత్తి పట్టి కనీసం ఇద్దరు ముగ్గురుని నరుకుతారేమో. దానికి కారణం  ఫలానా వాడు మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడని, తన మతం గురించి తప్పు వ్యాఖ్యలు చేశాడని, తన మతాన్ని గౌరవించలేదని చెప్పి చంపేశానని అంటాడని సెటైర్లు విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: