ఈ మద్య టాలీవుడ్ లో కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. మంచి కంటెంట్ తో కొత్త నటులు అయినా సరే సినిమాలు హిట్ చేస్తున్నారు.  టాలీవుడ్ లో అర్జున్ రెడ్డితో వంగా సంపత్,  ఆర్ఎక్స్ 100 తో అజయ్ భూపతి మంచి విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. 


ఇక అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ హీరోగా కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా ‘గీతా గోవిందం’లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకుడిగా తన సత్తా చాటారు పరుశరామ్.  గీతా ఆర్ట్స్ లో తీసిన రెండో సినిమా ఇది.  అందమైన ఈ ప్రేమకథాంశం యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది.  


ఆ సినిమా మొదట్లో  ఎలాంటి అంచనాలు రాలేదు.పైగా రెండు మూడు సార్లు వాయిదా కూడా పడింది.  దాంతో ఎలాంటి భారీ అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా వంద కోట్ల క్లబో లో చేరిపోయింది.   దర్శకుడిగా పరశురామ్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.


ఇటీవల పరుశరామ్ మహేష్ బాబుని కలిసి వచ్చినట్లు సమాచారం. తాను సిద్ధం చేసిన కథను వినిపించాడట. కథ కొత్తగా .. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పిన మహేశ్ బాబు, పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకురమ్మని చెప్పాడట.  ఈ మద్య కొత్త దర్శకులకు మంచి ఛాన్స్ ఇస్తున్నారు మహేష్ బాబు.  ఈ నేపథ్యంలో అనీల్ రావిపూడి తో ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. నిల్ రావిపూడి సినిమా తరువాత మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లేది పరశురామ్ తోనేనని అంటున్నారు. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో వుండనుందని సమాచారం.  





మరింత సమాచారం తెలుసుకోండి: