టాలీవుడ్ లో ఒకప్పుడు అందాల నటిగా పేరు తెచ్చుకున్న మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మాలీవుడ్ బ్యూటీ ‘మహానటి’సినిమాలో నటించింది.  మొదటి సారిగా టాలీవుడ్ లో ఒక సినీ తారపై వచ్చిన మొదటి బయోపిక్ మూవీ...సూపర్ హిట్ అయ్యి అనుకున్న అంచనాలు దాటి కలెక్షన్లు వసూళ్లు చేసింది.  ఈ సినిమాలో నటించిన కీర్తి సురేష్ కి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి.


ఇక సావిత్రి లాంటి గొప్ప నటి పాత్ర తనకు దక్కినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసిన కీర్తి సురేష్..ఆమె కనిపించాలని..ఆమె హావభావాలు అర్థం చేసుకొని సన్నివేశాలు పండించడానికి సావిత్రి సినిమాలు ఎన్నో చూసిందని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.  ఈ సినిమా గత ఏడాది ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


 ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రోజుతో ఈ సినిమా ఏడాది కాలాన్ని పూర్తిచేసుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని కీర్తి సురేశ్ ట్వీట్ చేసింది.  ‘సావిత్రి గొప్ప నటి పాత్ర నేను చేయగలను అనే ఆత్మస్థైర్యాన్ని నాకు కలిగించారు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరి సహాయ సహకారాలతోనే నేను ఈ పాత్రకి న్యాయం చేయగలిగాను. నాగ్ అశ్విన్ సహా ఈ విజయంలో భాగమైన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని ట్విట్టర్లో రాసుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: