ఎవరి సినిమా రిలీజైతే బాక్సులు బద్దలవుతాయో అతనే "రిషి".."మహర్షి". అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీ దత్, పి.వి.పి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి. పూజా హెగ్డే హీరోయిన్ గా అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమైనప్పటి నుంచే అటు మహేష్ అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే "భరత్ అనే నేను" సినిమా మహేష్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లను రాబట్టి తను నటించిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. 


ఊపిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న వంశీ పైడి పల్లి కథ చెప్పగానే అద్భుతంగా అనిపించడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ట్రైలర్స్, సాంగ్స్ తో చిత్ర బృందం ఎప్పటికప్పుడు మహర్షి సినిమా పై భారీగా అంచనాలను పెంచడంతో ప్రేక్షకులంతా ఈ సినిమా ఓరేంజ్ లో ఉంటుందని మహేష్ గతంలో సృష్ఠించిన తన రికార్డ్స్ ను తనే బ్రేక్ చేస్తాడని ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఫిక్సై పోయింది. అందుకు తగ్గట్టుగానే ఫ్యాన్స్ కోసం వేసిన బెనిఫిట్ షో దగ్గర్నుంచే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని నిజంగానే రికార్డ్స్ బద్దలు కొట్టుతోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. మొన్నటి వరకు అవేంజర్స్ కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మహర్షి వచ్చి ఆ కలెక్షన్లను బీట్ చేశాడు. ఈ జోరు ఇలాగే కంటిన్యూ అయితే  మహర్షి రికార్డ్స్ ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఏదేమైనా "సూపర్ స్టార్".. ఒక్కసారి ఫిక్సైతే ఎవ్వరి మాటా వినడని మహర్షి తో మళ్ళీ ప్రూవ్ చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: